Thursday, April 23, 2009

వివాహం 8


దదామీత్యగ్ని.........ఆదిత్యస్సత్యమోమితి ఈ కన్యను నేను దానం చేస్తున్నానని అగ్ని చెబుతున్నాడు.అలాగేనని వాయుదేవుడు అన్నాడు. అది నిజమా!నాకు ఇష్టమేనని చంద్రుడు అన్నాడు. సత్యమేనని ఆదిత్యుడు అంగీకరించాడు.
ఆపస్తత్సత్య ....................సంరుద్ధ్యతాం యజ్న దక్షిన రూపమైన కీర్తి కారణమైన ఈ కన్యను ఉదకము యొక్క దేవతలు తీసుకొని వచ్చారు. అందువలన నేను కోరిన సంతానం సమృద్ధిగా కలుగు గాక!

ఇలావరుడు తలంబ్రాలు పోసిన తరువాత వధువు వరునిపై తన దోసిలిలో తలంబ్రాలను పోస్తుంది. రెండవ సారి వెనుకటి లాగానే దోసిళ్ళలో తలంబ్రాలను నింపుకొని వధువు దోసిలిని పైన పెట్టి పై మంత్రాలను చదువుతూ చివరిలో మాత్రం ఈ క్రింది వాక్యం చెబుతూ వరునిపై తలంబ్రాలను పోస్తుంది. నాకిష్టమైన పశువులు పాడిపంటలు సంమృద్ధిగా ఉండాలి. ఇక మూడవసారి పై క్రియలన్నీ జరిగిన తరువాత వరుడి దోసిలి పైన పెట్టి ఈ క్రింది మంత్రం చెబుతూ వధువు పైన తలంబ్రాలు పోస్తాడు. నాకిష్టమైన త్యాగం సంమృద్ధిగా ఉండాలి. నాలుగవసారి మంత్రాలు లేకుండానే తలంబ్రాలు పోసుకొంటారు.కొందరిమతంలో ఈ క్రింది మంత్రంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొంటారు. మాకు కావలసిన సిరిసంపదలు సంమృద్ధిగా ఉండాలి. మాకు కీర్తి ప్రతిష్తలు సంమృద్ధిగా ఉండాలి. అనే అర్ధం వచ్చే మంత్రాలను కూడా చెబుతారు.


రక్షాబంధనం


కంకణాలు కట్టడాన్నే రక్షాబంధనం అంటారు. భౌతికమైన ఉపద్రవాలనుంచి రక్షణ కోసం , పురుడు, మైల మొదలైనవి సోకకుండా ఉండడంకోసం , కార్య నిర్వహణ దీక్ష కోసం కంకణాన్ని కడతారు. వరుడికి కుడిచేతికి , వధువుకి ఎడమ చేతికి కంకణం కట్టాలి. జరగబోయే పాణి గ్రహణానికి ఇది అంగం.వివాహంలో మంగళప్రదమైన ఈ కంకణం వధూవరుల రక్షణ కోసం ఉద్దేసింపబడుచున్నది. ఈ కంకణాన్ని నాలుగవ రోజు రాత్రి తిరిగి ఇప్పివేయాలి.


బ్రహ్మముడులు

వివాహంలో భార్యా భర్తల వస్త్రములకు బ్రహ్మ ముడులు అను పేరుతొ ముడులు వేస్తారు. ఆ వేయుటలో అభిప్రాయం ఏమనగా ? బ్రాహ్మణ ఆశీర్వచనములను దంపతుల కొంగులలో ముడి వేయుటఅని భావము. ఈ అర్ధమును స్ఫురిమ్పజేయు మంత్రమునే "గ్రందిం గ్రద్నాటి ఆశిష ఎవాస్యాం పరిగ్రుహ్నాతి" అను శృతిచే పాటిస్తారు. తరువాత బ్రహ్మముడి సదక్షినా ఫల తాంబూలములను వధూవరుల చేలాంచలములకు కట్టి ఆ రెండు కోణాలను కలిపి ఈ క్రింది అనువాకాన్ని చెప్పుచూ ముడి వెయ్యాలి.యోగాక్షేమస్య .................. ఆశిశామేవైతామాశాస్తే బ్రహ్మగ్రంది ముహూర్తః సుముహూర్తః అస్తు. పాణిగ్రహనాన్గామగుట చేత మా ఇద్దరి సంరక్షణ నిమిత్తం రక్షలను కట్టుచున్నాను. వరుని చేతికి ఈ మంత్రం చెబుతూ పురోహితుడు కడతాడు. తరువాత వరుడు వధువు వామ హస్తమునకు కడతాడు.


బృహత్సామ ................... సగరేన రక్షా వద్వా వామకరే బధ్నాతి


సప్తపది


వివాహంలో సప్తపది ముఖ్యమైన ఘట్టము. ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువుము.నీవు నడిచేటప్పుడు మొదటి అడుగులో శ్రీ మహా విష్ణువు , అన్నమును, రెండవ అడుగులో బలమును, మూడవ అడుగులో ఉత్తమ కర్మమునూ ,నాల్గవ అడుగులో కర్మ ఫలమునూ,ఐదవ అడుగులో పశు సంమ్రుద్ధినీ ,ఆరవ అడుగులో రుతు సంపత్తినీ , ఏదవ అడుగులో యజ్న సాధకులైనా హోత ప్రశాస్తా, బ్రాహ్మనాచ్చంసి , పోత, నిషా, అచ్చాలూక , అగ్నేద్ధ్రులనే ఏడుగురు రిత్విక్కులనూ ప్రసాదిన్చుగాక అని అర్ధమిచ్చే మంత్రమును పతిన్చవలెను.


వధువును అగ్నికి ఉత్తరమునకు కుడి కాలితో అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరమునకుగానీ, ఏడు మంత్రములచేత ఏడు అడుగులు నడిపించి అడుగులో "సఖా సప్త పదా భావ " మొదలు ఏహి సూనృతే వరకూ చాతుస్వరముతో వరుడు జపము చేయవలెను. హోమములకు ముందు అగ్నికిని బ్రహ్మగారికిని ప్రదక్షిణం చేసి , మునుపటి వలె ఉత్తర వరుడుగా కూర్చుని వధువు తనను తగిలి ఉండగా మంత్రపూతముగా 16 హోమములు చేయవలెను. నీవు నాతొ ఏడడుగులు నడచుట వలన మన ఉభయులకు మైత్రి సిద్ధించింది. నిన్ను నేను విడువను. నన్ను నీవు విడువకు. మనము అన్యోన్య ప్రేమతో అనుకూలమైన మనస్సు, సమానమైన దాంపత్యము కలవారమై విధి విహితమైన కార్యముల యందు సమానమైన ఆలోచనలు కలిగి ఒకే మనస్సు కలవారమై ధర్మ కార్యములు చేస్తూ చరింతుము గాక! నేను సామ వేదము వలె , నీవు ఋగ్వేదము వలె, అవినాభావ సంబంధము గల వారము అగుదుము గాక! అంటే ఋక్కులను విడిచి సామం , సామమును విడిచి రుక్కు ఉండనట్లే మనం కూడా ఆకారము విడిచి ఆకారము ఉండకుండుము గాక!
నేను స్వర్గము వంటి వాడిని , నీవు భూమి వంటి దానవు. అనగా భూమి ఆధారం .స్వర్గం ఆదేయం . ఆధార ,ఆదేయములకు కూడ అవినాభావ సంబంధము ఉన్నది.

No comments:

Post a Comment